Advertisement

  • బ్రేకింగ్ న్యూస్ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత..

బ్రేకింగ్ న్యూస్ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత..

By: Sankar Mon, 31 Aug 2020 6:37 PM

బ్రేకింగ్ న్యూస్ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత..


మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ (84) కన్నుమూశారు. కరోనా వైరస్‌ బారినపడిన ఆయన చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిశారు. కోవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తడంతో గతకొంత కాలంగా ఆర్మీ ఆస్పత్రిలోనే ఉంటున్నారు.

ఈ క్రమంలోనే ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ రావడంతో ఆరోగ్యం విషమించి మృతిచెందినట్లు ఆయన కుమారుడు అభిజిత్‌ ముఖర్జీ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన మృతిపట్ల కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతిగా, కేంద్రమంత్రిగా, కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతగా ప్రణబ్‌ భారత రాజకీయాల్లో తనదైన గుర్తింపు పొందారు..

కాగా ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు 10న అనారోగ్యంతో ఆర్మీ హాస్పిటల్‌లో చేరారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ఓ నాళంలో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేశారు. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోగా.. మరింత క్షీణించింది. అంతేకాకుండా.. ఆపరేషన్‌కు ముందు చేసిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రణబ్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.

అయితే ప్రణబ్ ఆరోగ్యం కాస్త మెరుగుపడినట్లు వైద్యులు పేర్కొన్నా.. చివరికి విషాదమే మిగిలింది. మచ్చలేని వ్యక్తిగా గుర్తింపు పొందిన ప్రణబ్ ముఖర్జీ తన కుటుంబసభ్యులు, అభిమానులను శోకసంద్రంలో ముంచుతూ ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయారు.

Tags :
|
|
|

Advertisement