సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రస్తావించిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా
By: chandrasekar Tue, 08 Dec 2020 08:33 AM
సూర్యకుమారి యాదవ్ కు
ఆస్ట్రేలియా టూర్ లో చోటు దక్కకపోవడం వల్ల అతనికి వచ్చిన అవకాశం గురించి
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ప్రస్తావించాడు. పాకిస్థాన్ మాజీ
క్రికెటర్ డానిష్ కనేరియా అక్కడి క్రికెట్ బోర్డుపై మండిపడ్డాడు. పాక్లో
నైపుణ్యం ఉన్న క్రికెటర్లు వేరే దేశానికి వెళ్లిపోవడంపై కనేరియా స్పందిస్తూ
ఇండియన్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రస్తావించాడు. అతడు
న్యూజిలాండ్ టీమ్కు ఆడేవాడే కానీ ఆ టీమ్ మాజీ ప్లేయర్ స్కాట్ స్టైరిస్ అతన్ని తమ
టీమ్కు ఆడాల్సిందిగా కోరాడు.
వారు ఇచ్చిన ఆఫర్ సమయంలో
సూర్యకుమార్కు అతని ఫ్రాంచైజీ, బీసీసీఐ అండగా నిలిచాయి. అందువల్ల అతను ఇండియాను
విడిచి వెళ్లలేదు అని కనేరియా అన్నాడు. పాక్ క్రికెటర్ సమీ అస్లమ్ ఈ మధ్యే
తాను అమెరికాకు వెళ్లిపోతున్నానని, ఆ దేశం నుంచి క్రికెట్ ఆడతానని చెప్పిన విషయాన్ని
కనేరియా గుర్తు చేశాడు. అస్లమ్ పాక్ తరఫున 2017లో ఆడాడు. మొత్తం 13
టెస్టులు, 4 వన్డేల్లో
పాక్ టీమ్కు ప్రాతినిధ్యం వహించాడు.
సమీ అస్లమ్ చాలా నిలకడైన
ఆటగాడని తెలిపాడు. కానీ అతనికి అన్యాయం చేశారు. అస్లమ్కు సరైన అవకాశాలు ఇవ్వలేదు.
ఇలాంటి ప్లేయర్స్ను దేశం వదిలి వెళ్లేలా పీసీబీ చేయడం దురదృష్టకరం అని కనేరియా
వివరించాడు. అలాగే తనకు కూడా రెండు దేశాల నుంచి ఆఫర్లు వచ్చాయని, తాను
మాత్రం దేశం వదిలి వెళ్లలేదని చెప్పాడు. ఆటగాళ్లకు సరైన అవకాశం కలిపించకపోవడంతో
ఇలాంటి వ్యతిరేక నిర్ణయాలకు లోనవుతారని తెలిపాడు.