మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ తుపాకీతో కాల్పులు మరియు కత్తితో దాడి
By: chandrasekar Sat, 19 Dec 2020 11:19 AM
క్రాంతి కాలనీలో
చోటుచేసుకున్న ఒక ఘర్షణలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ తుపాకీతో
కాల్పులు జరిపి కత్తితో దాడి చేయడంతో పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటనపై ఆదిలాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
చేస్తున్నారు. ఈ ఘర్షణలో ఫారూఖ్ అహ్మద్
తుపాకీతో కాల్పులు జరిపినట్లు మరియు కత్తితో దాడి చేసినట్లు తెలిసింది.
ఎంఐఎం నేత మరియు మాజీ
మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ ఈ ప్రాంతంలో చేసిన దాడిలో 8 మంది
తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఈ దాడిలో ఒక యువకుడి పరిస్థితి కాల్పుల
కారణంగా తీవ్రంగా మారడంతో హైదరాబాద్కు
చికిత్సకోసం తరలించారు. ఫారూఖ్ అహ్మద్ గత మునిసిపల్ ఎన్నికల్లో ఓటమికి కారణమైన వారిపై పగ
తీర్చుకున్నట్లు ఈ దాడిలో బాధితులు చెపుతున్నారు. అందువల్ల ఈయనపై చర్య తీసుకోవాలని
సూచించారు.