మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి ఏకంగా తుపాకీ పట్టుకొచ్చి సృష్టించిన బీభత్సం
By: chandrasekar Mon, 31 Aug 2020 3:30 PM
మాజీ మంత్రి ఒకరు తుపాకీ పట్టుకొచ్చి హల్ చల్ చేశారు. నల్గొండ జిల్లాలో మాజీ మంత్రి అయిన గుత్తా మోహన్ రెడ్డి ఏకంగా తుపాకీ పట్టుకొచ్చి బీభత్సం చేశారు. చిట్యాల మండలం ఉరుమడ్లలో పిల్లాయిపల్లి జరుగుతున్న కాలువ పనులను జరుగకుండా గుత్తా మోహన్ రెడ్డి అడ్డుకోవడంతో అక్కడ ఒక బీభత్స వాతావరణం నెలకొంది.
సర్వే ప్రకారమే పనులు నిర్వహిస్తుండగా తన భూమి నుంచి కాలువ వెళ్లొద్దంటూ ఇంజినీర్, జేసీబీ ఆపరేటర్తో వాగ్వాదానికి దిగారు. పనులు నిలిపేయాలంటూ తుపాకీతో వారిని బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లా ఎస్పీ వద్దకు చేరినట్లు తెలుస్తోంది. పనులకు ఆటంకం కలిగించినందుకుగానూ త్వరలో గుత్తా మోహన్రెడ్డిని అరెస్ట్ చేయగల అవకాశం ఉందని తెలుస్తోంది.
Tags :