ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తున్నారానంటున్న మాజీమంత్రి భూమ అఖిలప్రియ
By: chandrasekar Sat, 06 June 2020 12:28 PM
ఏవీ సుబ్బారెడ్డి తన
హత్యకు కుట్ర కేసులో భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్ హస్తం ఉందని ఆరోపించిన
వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీమంత్రి భూమా అఖిలప్రియ స్పందించారు. ఏవీ
సుబ్బారెడ్డి ఆరోపణల వెనక ఆళ్లగడ్డ అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉండొచ్చని ఆమె
ఆరోపించారు. ఓ కేసులో తన భర్త భార్గవ్ రామ్కు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నామని
దీన్ని పక్కదారి పట్టించేందుకు ఏవీ సుబ్బారెడ్డి ఆరోపణలు చేస్తున్నారని అఖిలప్రియ
అన్నారు. ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ఏ 4 ముద్దాయిగా తనకు ఎలాంటి
నోటీసులు అందలేదని అన్నారు.
ఈ కేసులో ఇంకా విచారణ
పూర్తి కాలేదని తమ హస్తం ఉన్నట్లు బయటకు రాలేదని ఆమె తెలిపారు. విచారణ
కొనసాగుతున్న తరుణంలో అఖిల ప్రియను అరెస్టు చేయాలని ఏవీ సుబ్బారెడ్డి అనడం
సరికాదని వ్యాఖ్యానించారు. భూమా నాగిరెడ్డి బినామీ ఆస్తులు ఏవీ సుబ్బారెడ్డి
పేరుతో ఉంటే అవి ఏవీ కుటుంబానికే చెందుతాయని భూమా అఖిలప్రియ అన్నారు. తమ మధ్య
ఆస్తి గొడవలు లేవని ఏవీ సుబ్బారెడ్డి బహిరంగంగానే చెప్పాడని అఖిలప్రియ తెలిపారు.
ఏవీ సుబ్బారెడ్డికి పదవులు ఇస్తే తాను అడ్డుకోలేదని వివరించారు. ఏవీ
సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డలో రాజకీయాలు చేయొద్దని చెప్పలేదని, ఏవీ
సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో రాజకీయాలు చేస్తానంటే స్వాగతిస్తానని అఖిలప్రియ స్పష్టం
చేశారు.