మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్ఏ ఖలీల్బాషా కరోనాతో మృతి
By: chandrasekar Wed, 12 Aug 2020 8:46 PM
మాజీ మంత్రి, తెలుగుదేశం
పార్టీ నాయకుడు ఎస్ఏ ఖలీల్బాషా మంగళవారం కన్నుమూశారు. డాక్టర్ బాషా కొంతకాలంగా
అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు కరోనా కూడా సోకినట్లు తెలిసింది. నగరంలోని ఓ
ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు
తెలిపారు.
బాషా మాజీ ముఖ్యమంత్రి
ఎన్టీ రామారావు కాలంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మైనారిటీ సంక్షేమ
శాఖల మంత్రిగా ఆయన పనిచేశారు. కడప ప్రసిద్ధ రాజకీయ నాయకుడిగా, వైద్య
నిపుణుడిగా, పేదలకు ఎలాంటి ఫీజు లేకుండా వైద్య సేవ చేసినట్లు
తెలిసింది.
ఇటీవల ఆయన వైసీపీలో
చేరినట్లు సమాచారం. జనసేన కడప నియోజకవర్గ
ఇన్చార్జి, రాయలసీమ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్
జిల్లాలోని పేద ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొని కుటుంబ సభ్యులను
ఓదార్చారు. బాషా కుటుంబ సభ్యులకు టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్రెడ్డి
సంతాపం వ్యక్తం చేస్తూ బాషా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.