Advertisement

  • విరాట్ కోహ్లీ బంతుల్ని డిఫెన్స్ చేస్తుండటంపై మండిపడ్డ మాజీ క్రికెటర్ పీటర్సన్

విరాట్ కోహ్లీ బంతుల్ని డిఫెన్స్ చేస్తుండటంపై మండిపడ్డ మాజీ క్రికెటర్ పీటర్సన్

By: chandrasekar Fri, 04 Sept 2020 10:05 AM

విరాట్ కోహ్లీ బంతుల్ని డిఫెన్స్ చేస్తుండటంపై మండిపడ్డ మాజీ క్రికెటర్ పీటర్సన్


ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ మ్యాచ్‌లు జరగనుండగా ఇప్పటికే అక్కడికి చేరుకున్న విరాట్ కోహ్లీ బెంగళూరు టీమ్‌తో కలిసి ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అయితే దాదాపు ఐదు నెలల తర్వాత బ్యాట్ పట్టిన కోహ్లీ తొలుత బంతిని బ్యాట్‌కి మిడిల్ చేయడానికే అధిక ప్రాధాన్యమిచ్చాడు. ఈ క్రమంలోనే అతను నెట్స్‌లో బంతిని ఎక్కువగా డిఫెన్స్ చేస్తూ కనిపించాడు. ప్రాక్టీస్ సెషన్‌లో వికెట్లపైకి దూసుకొస్తున్న బంతిని డిఫెన్స్ చేస్తున్న ఫొటోని తాజాగా విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో షేర్ చేయగా ‘‘కోహ్లీ బంతిని హిట్ చేయ్. ఇది టీ20.. టెస్టు మ్యాచ్ కాదు’’ అని పీటర్సన్ కామెంట్ చేశాడు.

వాస్తవానికి విరాట్ కోహ్లీ పవర్ హిట్టర్ తరహాలో ప్రతి బంతినీ స్టాండ్స్‌లోకి తరలించాలని బ్యాటింగ్ చేయడు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా గేర్లు మారుస్తాడు. అందుకే ఇప్పుడు ఐపీఎల్‌లో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌కే ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 177 మ్యాచ్‌లాడి 131.61 స్ట్రైక్‌రేట్‌తో ఏకంగా 5,412 పరుగులు చేశాడు. దీనిలో 5 సెంచరీలు ఉండగా 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Tags :
|

Advertisement