బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు బెయిల్
By: chandrasekar Fri, 09 Oct 2020 5:23 PM
దేశంలో తీవ్ర సంచలనం
లేపిన దాణా కుంభకోణానికి సంబంధించిన కేసులో లాలూ ప్రసాద్ యాదవుకు బెయిల్
దొరికింది. ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ
కేంద్రమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
దాణా కుంభకోణానికి సంబంధించిన ఓ కేసులో జార్ఖండ్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు
జారీచేసింది.
ప్రస్తుతం లాలూ ప్రసాద్
యాదవ్ ఇప్పటికే దాణా కుంభకోణం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్నారు.
మరోవైపు దుమ్కా ఖజానా కేసు కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. ఈ నేపథ్యంలో లాలూకు
ప్రస్తుతం బెయిల్ మంజూరైనా జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం మాత్రం లేదు.
ఇప్పుడు ఆయనకు బెయిల్ లభించిన లాభం చేకూరలేదు పాపం.
Tags :
former |
bihar |