రిటైర్ అయిన ఆటగాళ్లతో మ్యాచ్ ఆడాలని సవాల్ విసిరిన ఇర్ఫాన్ పఠాన్
By: Sankar Sun, 23 Aug 2020 7:58 PM
టీం ఇండియా స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే..అయితే ధోని లాంటి దిగ్గజ ఆటగాడు ఇలా అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడంతో అందరు ధోనికి ఫేర్ వెల్ మ్యాచ్ ఉండాలని అంటున్నారు..అయితే కుర్రాళ్ల జట్టుకు ఇర్ఫాన్ పఠాన్ ఓ సవాల్ విసిరాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో ఆడాలంటూ సవాల్ విసిరాడు. దీనికోసం ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో తన 11 మంది జట్టును కూడా ప్రకటించాడు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘గొప్ప క్రికెటర్లు ఎందరికో రిటైర్మెంట్ సమయంలో తగిన రీతిలో వీడ్కోలు లభించలేదని అనేకమంది అంటున్నారు. అలాంటప్పుడు వారందరికీ అద్భుతమైన ఫేర్వెల్గా ఓ చారిటీ మ్యాచ్ను నిర్వహిస్తే బాగుంటుంది కదా. ప్రస్తుతం భారత జట్టుతో వారంతా తలపడేలా ఓ మ్యాచ్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది..?’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చాడు.
దీనికోసం ఓ 11 మంది రిటైరైన ఆటగాళ్ల పేర్లనూ సూచించాడు. కుర్రాళ్లతో నిర్వహించే ఈ మ్యాచ్ వారందరికీ అద్భుతమైన ఫేర్వెల్గా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే ఇర్ఫాన్ జట్టులో అతడితోపాటు ధోనీ, ద్రవిడ్, గంభీర్, సెహ్వాగ్, లక్ష్మణ్, యువరాజ్, రైనా, అగార్కర్, జహీర్, ఓఝాలు ఉన్నారు.