Advertisement

  • రోహిణి పాత్ర కోసం...వివరాలు తెలిపిన జోహార్ దర్శకుడు తేజ

రోహిణి పాత్ర కోసం...వివరాలు తెలిపిన జోహార్ దర్శకుడు తేజ

By: chandrasekar Fri, 04 Sept 2020 11:37 AM

రోహిణి పాత్ర కోసం...వివరాలు తెలిపిన జోహార్ దర్శకుడు తేజ


యువ దర్శకుడు తేజ మర్ని దర్శకత్వంలో వచ్చిన ‘జోహార్’ సినిమాకి ఓటీటీలో ఇటీవల విడుదలైన చిత్రాల్లో ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది. స్వార్థపరుడైన ఓ సీఎం కారణంగా ఒకరితో ఒకరు సంబంధం లేని నలుగురు జీవితాలు ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొన్నది అనే కథాంశంతో రూపొందించిన ఈ చిత్రానికి ప్రేక్షక ఆదరణ లభించింది. అయితే ఈ చిత్రంలో సీనియర్ నటి రోహిణి జర్నలిస్ట్‌గా కీలకమైన పాత్రను పోషించారు. అయితే ఈ పాత్ర కోసం మొదట యాంకర్ అనుసూయను అనుకున్నాడట దర్శకుడు తేజ మర్ని. అయితే అనసూయ ప్లేస్‌లో రోహిణిని ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పుకొచ్చాడు ఈ యువదర్శకుడు. ‘ఈ పాత్ర కోసం నేను యంగ్‌స్టర్‌ను పెడదాం అనుకున్నా.. చాలా డిస్కషన్స్ జరిగాయి. ఆ సందర్భంలో యాంకర్ అనసూయను అడిగాం. ఆమెకు కూడా తన పాత్ర నచ్చింది. కాని రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అడగడంతో కుదర్లేదు.

జార్జిరెడ్డి హీరోయిన్‌ మస్కాన్‌ని అడిగాం.. రెమ్యూనరేషన్ దగ్గర తేడాలు రావడంతో మళ్లీ నేను ఆలోచనలో పడ్డాను. వాళ్లు అలా అనేసరికి నేను తప్పుడు దారిలో వెళ్తున్నానా అని ఆలోచించా.. సినిమాలో ఇంత దమ్మున్న సీన్.. ఓ సీఎంని ప్రశ్నిస్తోంది అంటే మనిషి కనిపించాలి. ఆ పాత్రకు హుందా రావాలి. కాని యంగ్‌గా ఉన్న వాళ్లని పెట్టడం వల్ల పాత్రకు పర్ఫెక్షన్ తగ్గుతుందేమో అని ఆలోచించి మళ్లీ ఆలోచిస్తే రోహిణి గారు ఆలోచనలోకి వచ్చారు. ప్రశ్నించే పవర్, దమ్ము ఆవిడలో కనిపించాయి. మేడమ్ ఒక్క సీనే అని చెప్పాను.. ఆమె చేస్తానని అన్నారు. కేవలం రెమ్యునరేషన్ గురించి ఆలోచించలేదు. ఆమెకు ఈ పాత్ర చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో నటించిన వాళ్లంతా చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నారు. నాకు చాలా సపోర్ట్ చేశారు. సీనియర్ నటుడు సుధాకర్ గారు కూడా నేను ఐదురోజులకే పేమెంట్ మాట్లాడా. కాని ఆయన తరువాత కూడా వర్క్ చేశారు. ఒక్క అనసూయ విషయంలోనే రెమ్యూనరేషన్ దగ్గర తేడాలు రావడంతో ఆమె ప్లేస్‌లో రోహిణిని తీసుకోవాల్సి వచ్చింది.. అయితే రోహిణి గారు చేయడం వల్ల ఆ పాత్ర మరింత హుందా వచ్చింది’ అంటూ దర్శకుడు తేజ మర్ని చెప్పారు

Tags :
|
|
|

Advertisement