Advertisement

  • తొలిసారి నిబంధన ఉల్లంఘనకే రూ. 1 కోటి జరిమానా: బీసీసీఐ

తొలిసారి నిబంధన ఉల్లంఘనకే రూ. 1 కోటి జరిమానా: బీసీసీఐ

By: chandrasekar Fri, 02 Oct 2020 02:32 AM

తొలిసారి నిబంధన ఉల్లంఘనకే రూ. 1 కోటి జరిమానా: బీసీసీఐ


ఐపీఎల్ 2020‌ సీజన్‌ 13 బయో బబుల్‌ వాతావరణంలో జరుగుతోంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రేక్షకుల్ని స్టేడియాలకు అనుమతించకుండానే మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. ఆటగాళ్లు, ఫ్రాంచైజీ యాజమానులు, జట్టులో మిగతా స్టాఫ్‌ మెంబర్స్‌ అంతా కూడా క్వారంటైన్‌ నియమాలకు కట్టుబడి ఉండాలనేది బీసీసీఐ నిబంధన. వీటిని మరింత కఠినతరం చేస్తూ బీసీసీఐ మరో అల్డిమేటం జారీ చేసింది.

ఎవరైనా హద్దులు దాటితే వారికి టోర్నీ నుంచి ఉద్వాసన తప్పదనే వార్నింగ్‌ ఇచ్చింది. ఈ మేరకు బీసీసీఐ అన్ని ఫ్రాంచైజీలకు నోటిఫికేషన్‌ను పంపింది. ఎవరైనా బయో బబుల్‌ నిబంధనను ఉల్లంఘిస్తే కచ్చితంగా ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. అదే సమయంలో ఒక మ్యాచ్‌ నుంచి సస్పెన్షన్‌ తప్పదు. ఇక రెండోసారి కూడా అదే తప్పు చేస్తే మాత్రం వారిని టోర్నమెంట్‌ను తొలగిస్తామని బీసీసీఐ తన నోటిఫికేషన్‌లో తెలిపింది.

ఇక వారి స్థానంలో రిప్లేస్‌మెంట్‌ కూడా ఏమీ ఉండదని తెలిపింది. తొలిసారి నిబంధన ఉల్లంఘనకే రూ. 1 కోటి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. కేవలం ఆటగాళ్లకే కాదు, జట్టు అధికారులకు ఫ్యామిలీ మెంబర్స్‌కు ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.‌ ప్రతీ ఐదు రోజులకొకసారి అంతా కరోనా టెస్టులు చేయించుకోవాలని బీసీసీఐ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

Tags :
|

Advertisement