Advertisement

  • ఫ్లిప్‌కార్ట్, నోకియా నూతన శ్రేణి ఎయిర్‌కండీషనర్లు భారత్‌లో...

ఫ్లిప్‌కార్ట్, నోకియా నూతన శ్రేణి ఎయిర్‌కండీషనర్లు భారత్‌లో...

By: chandrasekar Tue, 22 Dec 2020 2:16 PM

ఫ్లిప్‌కార్ట్, నోకియా నూతన శ్రేణి ఎయిర్‌కండీషనర్లు భారత్‌లో...


ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ నోకియా, ఈ-కామర్స్‌ మేజర్‌ ఫ్లిప్‌కార్ట్ కలిసి ఆవిష్కరించిన నూతన శ్రేణి ఎయిర్‌కండీషనర్లు భారత్‌లో ఈ నెల 29 నుంచి లభ్యం కానున్నాయి.

ఈ ఎయిర్‌ కండీషనర్ లు ప్రారంభ ధర రూ.30,999తో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఎయిర్‌ కండీషనర్లలో చాలా నూతన ఫీచర్లు ఉన్నాయి.

స్టెబిలైజర్‌ ఫ్రీ ఆపరేషన్‌తోపాటు 145-265వాట్ల సామర్థ్యం వీటి సొంతం. అడ్జస్టబుల్‌ ఇన్వర్టర్‌ మోడ్‌, ఎన్విరాన్‌మెంట్‌ ఫ్రెండ్లీ ఆర్‌-32 రిఫ్రిజిరెంట్‌, ఇంటెలిజెంట్‌ మోషన్‌ సెన్సర్లు, వై-ఫై కనెక్టెడ్‌ స్మార్ట్‌ క్లైమేట్‌ కంట్రోల్‌ తదితర ఫీచర్లు జత చేశారు.

6 ఇన్ 1 ఫిల్టర్స్‌, ఇంటెలిజెంట్‌ మోషన్‌ సెన్సార్‌, రిమోట్‌గా స్మార్ట్‌ఫోన్‌ వినియోగం, స్మార్ట్‌ ఫిల్టర్‌ క్లీన్‌ రిమైండర్‌, మల్టీపుల్‌ షెడ్యూలర్‌, సెల్ఫ్‌ క్లీనింగ్‌ టెక్నాల,ఈ లో వైబ్రేషన్‌తోపాటు ఎటువంటి శబ్దం వినిపించకుండా వీటిని రూపొందించారు.

43 అంగుళాల స్మార్ట్‌ టీవీలను ఆవిష్కరించిన ఈ రెండు సంస్థలు ఇటీవల నోకియా ప్యూర్‌బుక్‌ ఎక్స్‌14 లాప్‌టాప్‌ విపణిలో ప్రవేశపెట్టాయి.

ఇంతకుముందు నోకియా, ఫ్లిప్‌కార్ట్‌ భారతదేశంలో టీవీలు, లాప్‌టాప్‌లు ఆవిష్కరించాయి.

Tags :
|

Advertisement