ఫ్లిప్కార్ట్, నోకియా నూతన శ్రేణి ఎయిర్కండీషనర్లు భారత్లో...
By: chandrasekar Tue, 22 Dec 2020 2:16 PM
ప్రముఖ మొబైల్ ఫోన్ల
తయారీ సంస్థ నోకియా, ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్కార్ట్ కలిసి ఆవిష్కరించిన
నూతన శ్రేణి ఎయిర్కండీషనర్లు భారత్లో ఈ నెల 29 నుంచి లభ్యం కానున్నాయి.
ఈ ఎయిర్ కండీషనర్ లు
ప్రారంభ ధర రూ.30,999తో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఎయిర్ కండీషనర్లలో
చాలా నూతన ఫీచర్లు ఉన్నాయి.
స్టెబిలైజర్ ఫ్రీ
ఆపరేషన్తోపాటు 145-265వాట్ల సామర్థ్యం వీటి సొంతం. అడ్జస్టబుల్ ఇన్వర్టర్
మోడ్, ఎన్విరాన్మెంట్
ఫ్రెండ్లీ ఆర్-32 రిఫ్రిజిరెంట్, ఇంటెలిజెంట్ మోషన్ సెన్సర్లు, వై-ఫై
కనెక్టెడ్ స్మార్ట్ క్లైమేట్ కంట్రోల్ తదితర ఫీచర్లు జత చేశారు.
6 ఇన్ 1 ఫిల్టర్స్, ఇంటెలిజెంట్ మోషన్ సెన్సార్, రిమోట్గా
స్మార్ట్ఫోన్ వినియోగం, స్మార్ట్ ఫిల్టర్ క్లీన్ రిమైండర్, మల్టీపుల్
షెడ్యూలర్, సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాల,ఈ లో
వైబ్రేషన్తోపాటు ఎటువంటి శబ్దం వినిపించకుండా వీటిని రూపొందించారు.
43 అంగుళాల స్మార్ట్ టీవీలను ఆవిష్కరించిన ఈ రెండు
సంస్థలు ఇటీవల నోకియా ప్యూర్బుక్ ఎక్స్14 లాప్టాప్ విపణిలో ప్రవేశపెట్టాయి.
ఇంతకుముందు నోకియా, ఫ్లిప్కార్ట్
భారతదేశంలో టీవీలు, లాప్టాప్లు ఆవిష్కరించాయి.