దుబాయ్కు విమాన సర్వీసులు
By: chandrasekar Sat, 19 Sept 2020 6:08 PM
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
అన్ని విమానాలు దుబాయ్కు శనివారం నుంచి సాధారణ షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని ఎయిర్
ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలిపింది. భారత్ నుంచి దుబాయ్కు విమాన రాకపోకలు యథావిధిగా
కొనసాగుతాయని తెలిపింది.
సెప్టెంబర్ 4న
జైపూర్-దుబాయ్ విమానంలో ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
రెండోసారి ఇలా జరిగిన నేపథ్యంలో అక్టోబర్ 2 వరకు 15 రోజులపాటు దుబాయ్కు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్
విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవల
పేర్కొంది.
కానీ, శనివారం
నుంచి షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు నడుస్తాయని
ఎయిర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకష్టించింది. కరోనా మార్గదర్శకాలను కరెక్ట్ గా
పాటిస్తామని తెలిపింది. కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి నిలిపివేసిన
అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇంకా ప్రారంభించలేదు.
ఈ మేరకు విదేశాల్లో
చిక్కుకున్న భారతీయులను దేశానికి తరలించేందుకు, దేశంలోని విదేశీయులను ఇతర దేశాలకు తరలించేందుకు వందే
భారత్ మిషన్ కింద ప్రత్యేక విమాన సర్వీసులను కేంద్రం నడుపుతున్నది. అలాగే కొన్ని
దేశాలు కూడా భారత్కు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి.