కేరళలో ఘోర విమాన ప్రమాదం ..రన్ వే నుంచి పక్కకు జారిపోయిన విమానం
By: Sankar Fri, 07 Aug 2020 9:29 PM
దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కేరళలోని కాలికట్ ఎయిర్ పోర్ట్ లో క్రాష్ అయింది ..ఫ్లైట్ లో సరిగ్గా ఎంత మంది ఉన్నారో తేలేదు గాని విశ్వసనీయ సమాచారం మేరకు చాల మంది గాయపడినట్లు తెలుస్తుంది ...గాయపడిన వారిని ఎయిర్పోర్ట్ దగ్గర్లో ఉన్న ఆసుపత్రిలో జాయిన్ చేసినట్లు సమాచారం ..
ల్యాండింగ్ సమయంలో విమానం అదుపుతప్పి రన్వే నుంచి పక్కకు జారింది. విమానం ముందు భాగం ధ్వంసమైనట్లు ఘటనకు సంబంధించిన ఫోటోలను గమనిస్తే తెలుస్తోంది. పైలట్ మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 184 ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. కోజికోడ్లోని కరిపూర్ విమానాశ్రయంలో శుక్రవారం (ఆగస్టు 7) రాత్రి 7.45 గంల సమయంలో ఈ ఘటన జరిగింది.
Tags :
flight |
runway |
landing |