Advertisement

కార్లకు ఫ్లెక్సీ ఇంజిన్ ఆప్షన్ ప్లాన్

By: chandrasekar Thu, 10 Dec 2020 7:14 PM

కార్లకు ఫ్లెక్సీ ఇంజిన్ ఆప్షన్ ప్లాన్


వాహనాలు నడపడం వల్ల కాలుష్యం ఎక్కువగా వెలువడకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కార్లకు ఫ్లెక్సీ ఇంజిన్ ఆప్షన్ ప్లాన్ తీసుకురాబోతున్నారు. ఇందుకోసం పెట్రోలు అవసరం లేకుండా కార్లను నడిపే రోజులు రాబోతున్నాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధనాన్ని వాడటం వల్ల కాలుష్యాన్ని తగ్గించడం వీలవుతుంది.

రాబోయే రోజుల్లో రవాణా మంత్రిత్వ శాఖ వాహనాలకు ఫ్లెక్సీ ఇంజిన్ ఆప్షన్ ప్లాన్‌ను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వాహనదారులు తమ కార్లకు ఇంధనంగా పెట్రోలును కానీ లేదంటే ఇథనాల్‌ను కానీ వాడుకోవడానికి దీనివల్ల వీలు అవుతుందని తెలిపారు. ఇథనాల్ తయారీకి చెరకు బాగా ఉపయోగపడుతుందని, ఇందువల్ల ఇథనాల్ వినియోగాన్ని దేశంలో అధికం చేయాలనీ తెలిపారు. ఆత్మనిర్బర్ భారత్ లో భాగంగా దేశంలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంపూర్ణ సహకారం అందిస్తామని నితిన్ గడ్కరీ సెప్టెంబరులో చెప్పిన సంగతి తెలిసిందే.

ఇందువల్ల ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వాహనాలకు మన దేశంలో పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్లను ప్రవేశపెట్టాలని కోరారు. దీనిని ప్రోత్సహించుటకు గ్రీన్ ఫ్యూయల్‌ను అమ్మేందుకు వీలుగా సొంతంగా ఫ్యూయల్ పంపులను ఏర్పాటు చేసుకోవచ్చునని ఆటోమేకర్లకు చెప్పారు. దీని కోసం కార్ తయారీలో బీఎస్-4 నుంచి బీఎస్-6కు మారితే, బ్రెజిల్, అమెరికా మరియు కెనడా దేశాల తరహాలో ఫ్లెక్స్ ఇంజిన్లను ప్రవేశపెట్టవచ్చునని తెలిపారు. దీనివల్ల ఇంధనాన్ని దేశంలోనే ఉత్పత్తి చేసుకోవచ్చు మరియు ఉపాధి వృద్ధి చెందుతుంది.

Tags :
|
|
|

Advertisement