Advertisement

  • మరోసారి ప్రారంభించిన ఎంఐ ల్యాప్‌టాప్‌ల ఫ్లాష్‌సేల్

మరోసారి ప్రారంభించిన ఎంఐ ల్యాప్‌టాప్‌ల ఫ్లాష్‌సేల్

By: chandrasekar Sat, 11 July 2020 5:20 PM

మరోసారి ప్రారంభించిన ఎంఐ ల్యాప్‌టాప్‌ల ఫ్లాష్‌సేల్


గతనెలలో ఎంఐ నోట్‌బుక్‌ సిరీస్‌లో రెండు ల్యాప్‌టాప్‌లను చైనాకు చెందిన పాపులర్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్ షియోమీ భారత్‌లో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

షియోమీ ఎంఐ నోట్‌బుక్‌ 14 సిరీస్ ల్యాప్‌టాప్‌ల విక్రయాలను ఇవాళ మరోసారి ప్రారంభించింది. షియోమీ ఎంఐ నోట్‌బుక్‌ 14, ఎంఐ నోట్‌బుక్‌ 14 హారిజన్ ల్యాప్‌టాప్‌లను ప్రముఖ ఇ-కామర్స్‌ వెబ్‌సైట్‌ అమెజాన్‌, ఎంఐ.కామ్‌ నుంచి కొనుగోలు చేయవచ్చు.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్‌/డెబిట్‌ కార్డులతో వినియోగదారులు ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేస్తే రూ.2,000 డిస్కౌంట్ అందిస్తోంది. జూలై 16 తర్వాత ఎంఐ నోట్‌బుక్‌ ల్యాప్‌టాప్‌ల ధరలు పెరిగే అవకాశం ఉన్నది.

256 జీబీ స్టోరేజ్ ఎంఐ నోట్‌బుక్‌ ధర రూ.41,999 కాగా, 512 జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ ధర రూ.44,999గా ఉంది. నోట్‌బుక్‌ హారిజన్ ఎడిషన్‌ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నది. ఇంటెల్‌ కోర్‌ i5 చిప్‌సెట్‌ ధర రూ. 54,999 కాగా ఇంటెల్‌ కోర్‌ i7 వేరియంట్‌ ధర రూ.59,999గా నిర్ణయించారు.

Tags :
|
|
|

Advertisement