Advertisement

  • సాగర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం

సాగర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం

By: chandrasekar Fri, 04 Sept 2020 9:55 PM

సాగర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం


హైదరాబాద్ - సాగర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం సంభవించి, ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నల్లగొండ జిల్లా సమీపంలో హైదరాబాద్-సాగర్ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలైయ్యారు.

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా వద్ద కారు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో వాహనంలోని ఐదుగురు మృతిచెందారు. అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. కారులోని మృతదేహాలను బయటకు తీసి, పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పడంతో కారులోని ఐదుగురు తీవ్ర గాయాలు తగిలి అక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Tags :
|
|

Advertisement