బావిలో పడిన దూడను రక్షించబోయి ఐదుగురు నీటిలో మునిగి మృతి
By: chandrasekar Wed, 09 Sept 2020 2:07 PM
ప్రమాదవశాత్తు బావిలో
పడిన దూడను రక్షించబోయి ఐదుగురు నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటన ఉత్తర్ప్రదేశ్
రాష్ట్రం గోండా జిల్లాలోని మహారాజ్ గంజ్ సర్కిల్లో మంగళవారం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల
ప్రకారం... మహారాజ్గంజ్ సమీపంలోని ఓ గ్రామంలో దూడ ప్రమాదవశాత్తు బావిలో పడింది.
దాన్ని రక్షించడానికి మొదట ముగ్గురు
బావిలోకి దిగి ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయారు. వారిని రక్షించడానికని మరో
ఇద్దరు బావిలోకి దిగగా వారు కూడా మునిగిపోయారు.
గమనించిన
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సాయంతో ఐదుగురిని బయటకి
తీసి హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు చెప్పారు. మృతదేహాలను
పోస్టుమార్టం నిమిత్తం జిల్లా హాస్పిటల్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉండడంతో కుటుంబ సభ్యుల రోదనలు
మిన్నంటాయి. అయితే దూడను మాత్రం సజీవంగా బయటకు తీసుకొచ్చినట్లు జిల్లా కలెక్టర్
నితిన్ బన్సాల్ విలేకరులతో చెప్పారు.