Advertisement

  • ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం ..అయిదుగురు సజీవ దహనం

ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం ..అయిదుగురు సజీవ దహనం

By: Sankar Wed, 12 Aug 2020 10:22 AM

ప్రైవేట్ ట్రావెల్ బస్సులో అగ్ని ప్రమాదం ..అయిదుగురు సజీవ దహనం



ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలను ఎన్ని సార్లు హెచ్చరిస్తున్న వారి తీరు మారడం లేదు ..ఇంజిన్ సరిగా ఉందొ లేదో చూసుకోకుండానే బస్సులను తిప్పుతున్నారు ...దీనితో తీవ్ర ప్రమాదాలు సంభవిస్తున్నాయి ..తాజాగా కర్ణాటక లో అలంటి సంఘటనే జరిగింది ..ఇంజిన్ లో లోపం వలన బస్సు మొత్తం మంటలు వ్యాపించి అయిదుగురు సజీవ దహనం అయ్యారు.

ట్రావెల్స్ బస్సు విజయపుర నుంచి బెంగళూరుకు వెళ్తుండగా చిత్రదుర్గ జిల్లా హిరయూర్ వద్ద ఈ దుర్ఘటన సంభవించింది. ప్రమాద సమయానికి బస్సులో మొత్తం 32 మంది ప్రయాణికీలు ఉన్నారు. ప్రమాద మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఇంజిన్‌లో లోపం వల్ల మంటలు చెలరేగి, బస్సు మొత్తం వ్యాపించాయని ట్రావెల్స్ యాజమాన్యం పేర్కొంది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని హిరయూర్ ఎస్పీ రాధిక సందర్శించారు. క్షతగాత్రులను చికిత్స కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Tags :
|
|
|
|

Advertisement