Advertisement

  • టిక్ టాక్ మోజులో పడి ఇంటి నుంచి పారిపోయిన యువకులు

టిక్ టాక్ మోజులో పడి ఇంటి నుంచి పారిపోయిన యువకులు

By: Sankar Sun, 21 June 2020 7:29 PM

టిక్ టాక్ మోజులో పడి ఇంటి నుంచి పారిపోయిన యువకులు



ప్రస్తుతం యువత ఎక్కువగా వాడుతున్న అప్స్ లో మొదటి స్థానంలో ఉండేది టిక్ టాక్ ..టిక్ టాక్ లేకుండా రోజు గడవదు అనే స్థాయికి నేటి యువత చేరుకుంది ..టిక్ టాక్ లో వీడియోలు పెట్టి ఫేమస్ అయిపోవాలని ఏది చేయడం కోసమైనా వెనకాడటం లేదు ..

తాజాగా టిక్ టాక్ మోజులో అయిదుగురు యువకులు ఇంట్లోచి పారిపోయిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలోని తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది..ఓ యువకుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎన్‌.సతీష్‌బాబు శనివారం కేసు నమోదు చేశారు. అమలాపురం డీఎస్పీ షేక్‌ మాసుమ్‌ బాషా తెలిపిన వివరాల ప్రకారం.. మామిడికుదురు, నగరం గ్రామాలకు చెందిన నలుగురు, కాకినాడకు చెందిన మరో యువకుడితో కలిసి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత ఇంటి నుంచి పారిపోయారు. వీరంతా రెండు బైక్‌లపై వెళ్లి పోయారని గుర్తించారు.

వీరంతా టిక్‌ టాక్‌ వీడియోలు చేస్తూ స్నేహితులయ్యారని తెలుస్తోంది. అయితే వీరంతా ఎక్కడకు వెళ్లారన్నది మిస్టరీగా మారింది. ఓ యువకుడు రాసిన లెటర్‌లో తాము డబ్బు సంపాదన కోసం వెళ్తున్నామని, తమ కోసం ఎవరూ ఆందోళన చెందవద్దని, తమ తల్లితండ్రులను బాగా చూసుకోవాలని కోరాడు.ఈ యువకుల బృందం విశాఖపట్నం వెళ్లినట్లుగా సమాచారం రావడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. టిక్‌టాక్‌ మోజులో పడి ఈ యువకులు వెళ్లిపోయారని గుర్తించామని డీఎస్పీ మాసుమ్‌ బాషా విలేకర్లకు తెలిపారు.

Tags :
|
|

Advertisement