Advertisement

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాల్పుల కలకలం

By: Sankar Mon, 16 Nov 2020 8:41 PM

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో కాల్పుల కలకలం


సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని గోవింద్ పూర్ గ్రామ శివారులో కాల్పుల కలకలం చెలరేగింది. 30 ఎకరాల భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కాల్పులకి దారి తీసింది.

ఓ వర్గం పై, ఇంకొక వర్గానికి చెందిన వ్యక్తి తుపాకీతో గాలిలో నాలుగు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపధ్యంలో అక్కడికి చేరుకున్న చిరకూపల్లి పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. జహీరాబాద్ కు చెందిన అలీ అక్బర్, కమల్ సేట్ వర్గాల మధ్య ఈ వివాదం నడుస్తోన్నట్టు చెబుతున్నారు.

పది కోట్ల విలువైన భూమి వ్యవహారంలో కాల్పుల అనంతరం అలీ అక్బర్ వర్గంలో ఓ వ్యక్తికి గాయాలయినట్టు చెబుతున్నారు. కమల్ సేట్ వర్గం ఎదురు మళ్ళీ జహీరాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.

Tags :
|
|

Advertisement