Advertisement

  • పెట్రోల్ పంపులో చెలరేగిన మంటలు ..భయంతో వాహనదారుల పరుగులు

పెట్రోల్ పంపులో చెలరేగిన మంటలు ..భయంతో వాహనదారుల పరుగులు

By: Sankar Wed, 07 Oct 2020 3:12 PM

పెట్రోల్ పంపులో చెలరేగిన మంటలు ..భయంతో వాహనదారుల పరుగులు

ఒడిశా రాజ‌ధాని భువనేశ్వర్ లో భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. రాజ్‌భ‌వ‌న్‌కు స‌మీపంలోని ఓ పెట్రోల్ పంపులో ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. దీంతో సిబ్బంది, పెట్రోల్ కోసం వ‌చ్చిన వాహ‌న‌దారులు భ‌యంతో ప‌రుగులు తీశారు.

స్థానికులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు వెంట‌నే ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్నారు. ఆరు ఫైరింజ‌న్‌ల సాయంతో మంట‌లు ఆర్పుతున్నారు.రాజ్‌భ‌వ‌న్‌కు స‌మీపంలోనే ప్ర‌మాద స్థలం ఉండ‌టంతో పోలీసులు ప‌టిష్ట భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టారు. రాజ్‌భ‌వ‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లో వాహ‌నాల రాక‌పోక‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేశారు.

కాగా, మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం ప్ర‌మాదంలో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయ‌ని, వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించార‌ని భువ‌నేశ్వ‌ర్ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సుధాన్షు సారంగి తెలిపారు.

Tags :
|

Advertisement