Advertisement

  • విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ...2 కోట్ల మేర ఆస్థి నష్టం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ...2 కోట్ల మేర ఆస్థి నష్టం

By: Sankar Thu, 05 Nov 2020 12:22 PM

విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ...2 కోట్ల మేర ఆస్థి నష్టం


ఆంధ్రప్రదేశ్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని విశాఖ స్టీల్‌ ప్లాంటులో అగ్ని ప్రమాదం ఇవాళ ఉదయం జరిగింది. ప్లాంటులోని టీపీపీ-2 లో మంటలు చెలరేగాయి.

టర్బైన్‌ ఆయిల్‌ లీక్ కావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. ఈ ఘటనలో 1.2 మెగావాట్ల విద్యుత్‌ మోటార్లు దగ్ధమయ్యాయి. రూ. 2 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. అయితే..వెంటనే స్పందించిన అధికారులు మంటలను ఆర్పడంతో పెనుప్రమాదమే తప్పింది. కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది.

అసలు ఈ అగ్ని ప్రమాదానికి కారణాలు, ఎందుకు ఇలా జరిగిందని తెలుసుకునే పనిలో పడ్డారు అధికారులు. కాగా..ఏపీలో లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇప్పటికే చాలా అగ్నిప్రమాదాలు జరిగాయి. ఇక విజయవాడ కోవిడ్‌ సెంటర్‌, అంతర్వేదిలో అగ్ని ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే...

Tags :
|

Advertisement