ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమాదం ..బయటకు పరుగులు తీసిన ప్రయాణికులు
By: Sankar Sun, 18 Oct 2020 11:56 AM
విజయవాడ నగర శివారులోని ప్రసాదంపాడు వద్ద జాతీయరహదారిపై ఓ టూరిస్ట్ బస్సుకు స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
శ్రీకాకుళం నుంచి విజయవాడ వస్తున్న బస్సు ప్రసాదంపాడు సమీపంలోకి రాగానే బస్సు వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు టైర్ పగిలిపోవడంతో ఈ మంటలు చెలరేగాయి. మంటలు వ్యాప్తి చెందడంతో ఒక్కసారిగా బస్సులో నుంచి ప్రయాణికులు బయటకు పరుగులు తీశారు. పెన్నుముప్పు తప్పడం తో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు.
విషయం తెలిసిన అగ్నిమాపక సిబ్బంది...ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు.. స్థానికుల సాయంతో బస్సును పక్కకు నెట్టి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
Tags :