డ్రగ్స్ కేసు విచారణలో సినీ నిర్మాత భార్య అదుపులోకి
By: chandrasekar Mon, 09 Nov 2020 3:12 PM
అనతి కాలంగా చాలా మంది
సినీ ప్రముఖులు డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేయబడ్డారు. ప్రస్తుతం డ్రగ్స్ కేసు
విచారణలో సినీ నిర్మాత భార్య అదుపులోకి తీసుకోబడ్డారు. బాలీవుడ్లో డ్రగ్స్ కేసు
విచారణ కొనసాగుతోంది. సుశాంత్ కేసులో ఈ కోణం బయటపడగా రంగంలోకి దిగిన ఎన్సీబీ
డ్రగ్స్ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా పలువురిని ఎన్సీబీ
అధికారులు అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం బాలీవుడ్ సినీ
ఇండస్ట్రీలో నిర్మాత ఫిరోజ్ నదియాడ్వాలా భార్య షబానా సయీద్ని డ్రగ్స్ కేసులో
అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే
ధ్రువీకరించారు. షబానాను నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్
(ఎన్డీపీఎస్) చట్టం కింద అరెస్టు చేశామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
కొనసాగుతున్న విచారణలో
షబానా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో సబర్బన్ జూహూలోని
షబానా నివాసంలో సోదాలు నిర్వహించగా 10 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో ఆమెను విచారణకు
పిలిచిన ఎన్సీబీ అరెస్టు చేసింది. ఇక ఇదే కేసులో ఫిరోజ్ను సైతం ఎన్సీబీ అధికారులు
విచారణకు పిలిచారు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి వుంది.