Advertisement

త‌మిళ‌నాడులో అధికార పార్టీలో వ‌ర్గ‌పోరు...

By: chandrasekar Tue, 29 Sept 2020 5:31 PM

త‌మిళ‌నాడులో అధికార పార్టీలో వ‌ర్గ‌పోరు...


త‌మిళ‌నాడులో అధికార పార్టీ అయిన అన్నా డీఎంకేలో వ‌ర్గ‌పోరు ప్రారంభంమైంది. సీఎం ప‌ళ‌నిస్వామి, డిప్యూటీ సీఎం ప‌న్నీర్ సెల్వం మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వం విష‌య‌మై వివాదం మొద‌లైంది.

వ‌చ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న కారణంగా ఆ విష‌య‌మై చ‌ర్చించేందుకు సోమ‌వారం చెన్నైలో అన్నాడీఎంకే కార్య‌వ‌ర్గ స‌మావేశం జ‌రిగింది. అక్టోబ‌ర్ 7న సీఎం అభ్య‌ర్థిని ఖరారు చేయాల‌ని ఈ స‌మావేశంలో నిర్ణ‌యించారు.

అంత‌వ‌ర‌కు బాగానే కొన‌సాగిన కార్య‌వ‌ర్గ భేటీ సీఎం అభ్య‌ర్థి ఎవ‌ర‌నే విష‌యంలో చ‌ర్చ మొద‌ల‌య్యే స‌రికి రచ్చ మొద‌లైంది. సీఎం ప‌ళ‌నిస్వామి త‌న‌నే సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించాల‌ని కోర‌గా త‌న‌నే సీఎం క్యాండిడేట్‌గా ఖ‌రారు చేయాల‌ని ప‌న్నీర్ సెల్వం కోరడంతో వివాదం రేగింది.

దీంతో పార్టీ కార్య‌వ‌ర్గం రెండు గ్రూపులుగా విడిపోయి పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. ఈ నేప‌థ్యంలో కార్య‌వ‌ర్గ స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్టుగానే అక్టోబ‌ర్ 7న సీఎం అభ్య‌ర్థిని ప్ర‌క‌టిస్తారా లేదా అనేది ఇప్పుడు స‌స్పెన్స్‌గా మారింది.

Tags :
|
|

Advertisement