Advertisement

  • కరోనా మీ వల్లే వచ్చిందంటూ గ్రామంలో రెండువర్గాల మధ్య ఘర్షణ.. స్వల్ప గాయాలు

కరోనా మీ వల్లే వచ్చిందంటూ గ్రామంలో రెండువర్గాల మధ్య ఘర్షణ.. స్వల్ప గాయాలు

By: Sankar Fri, 28 Aug 2020 11:30 AM

కరోనా మీ వల్లే వచ్చిందంటూ గ్రామంలో రెండువర్గాల మధ్య ఘర్షణ.. స్వల్ప గాయాలు


కరోనా వైరస్ రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కంటికి కనిపంచని ఈ వైరస్ అనేక దారుణాలకు తెరతీస్తుంది..కరోనా రాకతో మనుషుల బంధాలు దూరం అయ్యాయి..ఒకరోతో ఒకరు కలిసి మాట్లాడే పరిస్థితి లేకుండా అయింది..మనుషుల్ని ఇంతలా పట్టి పీడిస్తున్న కరోనా తాజాగా నిన్నమొన్నటి వరకు కలిసున్న ఇరుగు, పొరుగు మధ్య కూడా చిచ్చు పెడుతోంది.

తాజాగా మీవల్లే కరోనా వచ్చిందంటూ ఓ గ్రామంలో ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుుకున్నారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నరసింహపురంలో జరిగింది. గ్రామంలో కరోనా మీ వలనే మాకు వచ్చిందన్న అనుమానంతో రెండు వర్గాల వారు ఇళ్ళలోకి వెళ్లి మరి దాడులు చేసుకున్నారు.

మాకు కరోనా లేదని చెప్పిన వినకుండా మహిళలు పిల్లలపై కర్రలతో దాడి చేసుకున్న వైనం ఈ దాడిలో ఇరు వర్గాల వారికి స్వల్పంగా గాయాలు అయ్యాయి, ఇరు వర్గాల వారు చింతకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దింతో పోలీసులు రెండు వర్గాలకు చెందిన వారిమీద కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Tags :
|

Advertisement