కివీస్, ఆసిస్ ఆతిథ్యం లో ఫిఫా 2023 ఉమెన్స్ వరల్డ్కప్
By: chandrasekar Mon, 29 June 2020 10:51 AM
2023లో జరగనున్న ఫిఫా మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్కు
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మెగా ఈవెంట్ ఆతిథ్యం కోసం దాఖలు చేసిన బిడ్లో
ఆసిస్, కివీస్లు
కొలంబియాను వెనక్కి నెట్టాయి. 2023లో జరగనున్న ఈ మెగాటోర్నీ ఆతిథ్యాన్ని న్యూజిలాండ్, ఆసిస్
దక్కించుకున్నాయని ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ప్రకటించారు.
రెండు దేశాల్లో కలిపి
మొత్తం 12
నగరాల్లోని 13 స్టేడియాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. ప్రపంచకప్
మ్యాచ్లు 2023, జూలై 10 నుంచి ఆగస్టు 10 వరకు జరగనున్నాయి. 2019లో ఫ్రాన్స్ వేదికగా
జరిగిన ప్రపంచకప్లో 24 జట్లు పాల్గొన్నాయి. అయితే మొదటిసారిగా 2023లో
జరగనున్న ప్రపంచకప్లో 32 జట్లు పాల్గొంటాయి.
మొత్తం 8
నాలుగు గ్రూపులుగా జట్లను విభజిస్తారు. ఒక్కో గ్రూప్లో నాలుగు జట్లు ఉంటాయి.
క్వాలిఫయింగ్ మ్యాచులు వచ్చే ఏడాది ప్రారంభంకానున్నాయి. మహిళల ఫుట్బాల్
ప్రపంచకప్ను అమెరికా జట్టు అత్యధికంగా నాలుగుసార్లు గెలుపొందింది. గత రెండు
వరల్డ్ కప్లలో (2019, 2015) అమెరికా గెలుపొందింది.