Advertisement

మరణం అనే మాట వింటే భయం: సుశాంత్ సింగ్

By: chandrasekar Thu, 25 June 2020 12:00 PM

మరణం అనే మాట వింటే భయం: సుశాంత్ సింగ్


మరణం అనే మాట వింటే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరింత భయపడేవాడు. ఆ మాట స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాంటి వాడు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడంటే ఎంత కష్టం వచ్చిందో పాపం అంటున్నారు ఇప్పుడు అభిమానులు.

కొన్నేళ్ల కింద ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మరణం అనే పదమే చాలా భయం అనిపిస్తుందని చెప్పుకొచ్చాడు ఈ కుర్ర హీరో. మీ జీవితంలో దేనికి మీరు ఎక్కువగా భయపడతారు అనే ప్రశ్న ఎదురైనపుడు బహుశా చావుకే అని సమాధానమిచ్చాడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.

మూడు గంటలు నిద్రపోతేనే మనం ఎవరో కూడా మనకు తెలియని లోకంలోకి వెళ్ళిపోతుంటాం. మన ముందు ఎవరున్నారనేది కూడా తెలియదు. ఆ పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందని చెప్పాడు సుశాంత్. అలాంటిది చనిపోయినప్పుడు ఇంకెలా ఉంటుందో.

దాదాపు అంతే భయంకరంగా ఉంటుందేమో ఆ సమయంలో ఎవరికి ఎవరితోను సంబంధం ఉండదని సుశాంత్ చెప్పాడు. మరణం గురించి అంతలా మాట్లాడిన సుశాంత్ ఎందుకు అలా బలవన్మరణం చెందాడని అభిమానులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

చివరి సినిమా చిచ్చోరేలో కూడా జీవితంలోని సమస్యలకి ఆత్మహత్య పరిష్కారం కాదని చెప్పిన ఈయన తను మాత్రం ప్రాణాలు తీసుకున్నాడు. తల్లి మరణాన్ని కూడా తట్టుకుని నిలబడిన ఈయన ఆ తర్వాత ఎన్నో భావోద్వేగపు పోస్టులు కూడా పెట్టాడు.

చిన్న వయసులోనే అమ్మ మరణం తర్వాత కూడా ఎన్నో కష్టాలను ఎదురొడ్డి నిలుస్తూ వచ్చిన ఇతను చివరికి ఏదో కష్టం ముందు అయితే తల వంచేసాడు. జూన్ 14న ఈయన మరణించినా కూడా ఇప్పటికీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సుశాంత్ గురించే ఎక్కువగా కనిపిస్తుంది.

Tags :
|
|

Advertisement