భార్యతో గొడవ ..ముగ్గురు పిల్లలతో తండ్రి అదృశ్యం
By: Sankar Tue, 10 Nov 2020 06:36 AM
మేడ్చల్ జిల్లా దుండిగల్లో తండ్రితో సహా ముగ్గురు పిల్లలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఆదివారం సాయంత్రం భార్యాభర్తల మధ్య గొడవ చెలరేగడంతో తండ్రి పిల్లల్ని తీసుకొని వెళ్లిపోయాడు.
ఇతని పేరు మజీద్. ఇతనిది గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణానికి చెందిన షేక్ అబ్దుల్ మజీద్ (29) పదేళ్ల క్రితం ఏస్తేరు అనే యువతిని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చి కుత్బుల్లాపూర్లోని సురారం కాలనీలో నివాసం ఉంటున్నాడు. వీరికి షేక్ వాహిద్ , వజీద్ , నటాయా అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. మజీద్ వడ్రంగి (కార్పెంటర్) పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఈ క్రమంలో కొంతకాలంగా మద్యానికి బానిసైన మజీద్.. భార్యను వేధిస్తూ తరచూ గొడవపడుతున్నాడు. ఆదివారం సాయంత్రం దంపతుల నడుమ గొడవ జరగడంతో పిల్లలను తీసుకొని బయటకు వెళ్లిన మజీద్ మళ్లీ తిరిగి రాలేదు. భార్య తమ బంధువు, తెలిసిన వారి వద్ద ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి ముగ్గురి కోసం గాలిస్తున్నారు.