Advertisement

  • కూతురు మరణ వార్త విని గుండెపోటుతో మరణించిన తండ్రి

కూతురు మరణ వార్త విని గుండెపోటుతో మరణించిన తండ్రి

By: Sankar Mon, 27 July 2020 12:06 PM

కూతురు మరణ వార్త విని గుండెపోటుతో మరణించిన తండ్రి



తల్లి తండ్రులు కూతుర్లను అల్లారుముద్దుగా పెంచుకుంటారు ...కొడుకును అయినా ఒక మాట అంటారు గాని కూతురుని మాత్రం ఏ మాత్రం చిన్న హాని కలగకుండా పెంచుతారు ..పెళ్లి అయి అత్తారింటికి వెళ్లిన కూడా కూతురు కావాల్సినవి అన్ని సమకూరుస్తుంటారు ..అయితే ఇంత అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చనిపోయింది అని అకస్మాత్తుగా ఫోన్ వస్తే ఇంత కాలం పెంచిన తండ్రి గుండె తట్టుకోగలదా ..కడప జిల్లాలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది ..కూతురు చనిపోయింది అని ఫోన్ రాగానే ఆ వార్త విన్న తండ్రి గుండె కూడా ఆగిపోయింది ..

రాయచోటికి చెందిన సుభాన్ గతంలో వీఆర్వోగా పనిచేశారు. అయితే ఆయన కుమార్తె ఇటీవల అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరింది. కూతురికి ఆరోగ్యం సరిగా లేకపోడంతో తండ్రి మనసు తల్లడిల్లింది.. ఆయన కూడా మానసికంగా బాధపడ్డారు. ఆయన కూడా అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తర్వాత సుభాన్ కుమార్తె ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూసింది..

కూతురు మరణ వార్త తెలియడంతో సుభాన్‌కు గుండెపోటు వచ్చింది.. ఆయన కూడా ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయనకు ఇది వరకే గుండె సంబంధిత శస్త్రచికిత్స జరిగిందని కుటుంబ సభ్యులు చెప్పారు. తండ్రి, కుమార్తె మృతి చెందడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కూతురి మరణాన్ని ఆ తండ్రి గుండె తట్టుకోలేపోయింది. ఇంట్లో తండ్రీ, కూతుళ్లు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు..

Tags :
|
|
|

Advertisement