Advertisement

  • అనారోగ్యంతో ఉన్న తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్తు రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి

అనారోగ్యంతో ఉన్న తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్తు రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి

By: Sankar Wed, 19 Aug 2020 10:59 AM

అనారోగ్యంతో ఉన్న తండ్రిని హైదరాబాద్ తీసుకెళ్తు రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకు మృతి


నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఇద్దరు ప్రాణాల్ని బలితీసుకుంది. జిల్లాలోని దామచర్ల మండలం కొండప్రోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని అంబులెన్స్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో అంబులెన్స్‌ డ్రైవర్‌ గాయపడ్డాడు.

మృతులను నెల్లూరు జిల్లావాసులుగా గుర్తించారు. గుండాల కమలాకర్‌రెడ్డి (40), నందగోపాల్‌రెడ్డి (70) ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెంది. రోగిని అంబులెన్స్‌లో నెల్లూరు నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది.

అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని హైదరాబాద్‌ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా లారీని అంబులెన్స్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా...అంబులెన్స్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. చికిత్స కోసం వెళ్తున్న తండ్రికొడుకులు ఇలా మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Tags :
|
|
|

Advertisement