Advertisement

కృష్ణా జిల్లాలో భారీ పేలుడు ..ఇద్దరు మృతి

By: Sankar Thu, 03 Sept 2020 3:19 PM

కృష్ణా జిల్లాలో భారీ పేలుడు ..ఇద్దరు మృతి


కృష్ణా జిల్లా సూరంపల్లిలోని మహిళా పారిశ్రామికవాడలో పేలుడు సంభవించింది. స్క్రాబ్ కొనుగోలుకు వచ్చిన తండ్రీకొడుకులు ఇద్దరు చనిపోయారు. పేలుడు తీవ్రతకు మృతదేహాలు... 50 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. సూరంపల్లి పారిశ్రామికవాడలో జయరాజు ఎంటర్ ప్రైజెస్ లో ఈ పేలుడు సంభవించింది. తండ్రి కొడుకులు వాంబే కాలనీకి చెందిన కోటేశ్వరరావు, చిన్నారావులుగా గుర్తించారు. ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా, పేలుడు ధాటికి ఎగిరి రేకుల మీద కొడుకు మృతదేహం పడింది. తండ్రి మృతదేహం ఏమో పక్క కంపెనీ వైపు కు ఎగిరి పడినట్టు గుర్తించారు.

విచారణ చేపట్టిన పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాధమికంగా కెమికల్స్ కారణంగా పేలుడు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి ఎన్డీఆర్ఫ్ బృందం చేరుకుంది. మృతదేహాలు మార్చురీకి తరలించగా ఘటనా స్థలంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. ఇక భారీ శబ్ధంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.

ఈ ఘటనపై జిల్లా ఇన్ చార్జి మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్య సహాయాన్ని అందించాలని జిల్లా అధికారులని ఆయన ఆదేశించారు.ప్రమాదంపై విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వపరంగా అండగా వుంటామని ఆయన హామీ ఇచ్చారు.

Tags :
|
|

Advertisement