బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వని రైతులు ఏఈఓలను సంప్రదించాలి: జనార్దన్రెడ్డి
By: chandrasekar Sat, 04 July 2020 3:59 PM
సాగు కోసం పెట్టుబడి
పెట్టలేక ఇబ్బందులు పడుతోన్న రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని రైతు బంధు పథకానికి
తీసుకొచ్చారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. అయితే, కొందరికి
రైతు బంధు అందడంలేదు బ్యాంకుకు సంబంధించి వివరాలు సరిగా లేకపోవడం ఇతర
సాంకేతిక సమస్యలతో కూడా కొన్ని సార్లు ఇబ్బందులు వస్తున్నాయి.
2020 వానాకాలానికి సంబంధించి రైతుబంధు పెట్టుబడి సాయం
పంపిణీపై ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు బ్యాంకు ఖాతాలు ఇవ్వని రైతులు ఏఈఓలను కలవాలన్నారు.
ఏఈఓలను కలిసి వారి వద్ద వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వ్యవసాయ అధికారులకు
ఫిర్యాదు చేసినా కొన్నిసార్లు సమస్య పరిష్కారం కావడంలేదు వీటికి చెక్
పెట్టేందుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించిన ఫిర్యాదుల
కోసం గ్రేవీన్స్ సెల్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు వ్యవసాయశాఖ కమిషనర్ జనార్ధన్రెడ్డి.
ఇప్పటి వరకు 56,94,185 మంది రైతుల ఖాతాల్లో 7,183.67 కోట్లు జమ చేసినట్టు ప్రకటనలో పేర్కొన్న వ్యవసాయశాఖ
కమిషనర్ తమ బ్యాంకు ఖాతా నంబర్లను నమోదు చేసుకొని రైతులు ఈ నెల 5వ తేదీ
లోపు నమోదు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 34,860 మంది రైతుల బ్యాంకు ఖాతా నంబర్లు సరిగా లేకపోవడంతో ఖాతాల్లో డబ్బులు జమకాలేదని
తెలిపారు. కాగా, ప్రతీ రైతుకు రైతుబంధు పథకం వర్తింపజేస్తామని
ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
రైతుబంధు నగదు జమకాని
రైతులు ఈ నెల 5వ తేదీలోగా ఏఈఓలను కలిసి బ్యాంకు ఖాతాల వివరాలు నమోదు
చేసుకోవాలని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్రెడ్డి తెలిపారు. ఆ
రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసినా నగదు జమ కాలేదన్నారు. ఐఎఫ్ఎస్సీ కోడ్ సరిగా లేక, ఖాతాలు
మూసేయడం వల్ల నగదు జమ కాలేదన్నారు. 3,400 మంది రైతులకు బ్యాంకు పాసు పుస్తకాల్లో తేడాలు
ఉన్నాయన్నారు. ఆధార్, పట్టాదారు పుస్తకాల్లోని ఖాతాదారుల పేర్లలో
వ్యత్యాసాలు ఉన్నాయన్నారు. అర్హత ఉన్నా నిధులు జమ కానైట్లెతే ఏఓ, ఏడీ, డీఏఓలను
సంప్రదించాలని తెలిపారు.