Advertisement

  • వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు రైతు సంఘాల నిరాహార దీక్ష

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు రైతు సంఘాల నిరాహార దీక్ష

By: Sankar Sun, 13 Dec 2020 7:14 PM

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రేపు రైతు సంఘాల నిరాహార దీక్ష


రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. గత 17 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. రైతు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, రద్దు మినహా సవరణలు చేసినా ఒప్పుకోబోమని అన్నారు.

అయితే.. రైతుల డిమాండ్‌లపై కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు నిరాహారదీక్షకు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చాయి. ఈ నేపథంలో ఢిల్లీ సరిహద్దుల్లో అదనపు బలాగాలు మోహరించాయి. ఈ నెల 19 లోపు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు అల్టిమేటం ఇచ్చారు.

కేంద్రం దిగిరాకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రైతులు హెచ్చరికలు జారీ చేశారు. రైతుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ భేటీ అయ్యారు. ఇక రేపు జరిగే... రైతుల నిరాహార దీక్షకు విపక్షాలు సైతం మద్దతు పలికాయి.

అయితే.. రైతులకు మద్దతుగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కూడా ఒక రోజు ఉపవాస దీక్ష చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. రైతులకు మద్దతుగా ఒక రోజు ఉపవాసం చేపట్టాలని కేజ్రీవాల్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తం రైతులకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు

Tags :
|

Advertisement