డిసెంబర్ 8 న భారత్ బంద్ కు పిలుపు ఇచ్చిన రైతు సంఘాలు...
By: Sankar Fri, 04 Dec 2020 7:13 PM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే.
గత కొద్దిరోజులుగా ప్రభుత్వానికి రైతులకు మధ్య చర్చలు జరుగుతున్నా అవి ఫలితాన్నివ్వటం లేదు. ఈ నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన రైతులు భారత్ బంద్కు పిలుపునిచ్చారు. డిసెంబర్ 8వ తేదీన దేశ వ్యాప్త బంద్ పాటించాలని నిర్ణయించారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే అన్ని రహదారులను మూసేస్తామని ప్రకటించారు..
దేశ వ్యాప్తంగా ఉన్న టోల్గేట్లను స్వాధీనపర్చుకుని టోల్ గేట్ ఫీజులు వసూలు చేసుకోకుండా అడ్డుకుంటామని చెప్పారు. ‘‘ ఈ ఉద్యమంలో మరికొంత మంది చేరతారు. విద్యుత్ ఛార్జీలు, పంట నష్టం విషయంలో ప్రభుత్వం మా డిమాండ్లను ఒప్పుకుంటుందో లేదో చూడాలి’’ అని నిరసనలు తెలుపుతున్న ఓ రైతు సంఘం నాయకుడు హరిందర్ సింగ్ లోఖోవాల్ అన్నారు