రైనా ..ప్లీజ్ కమ్ బ్యాక్ ..చెన్నై సూపర్ కింగ్స్ అభిమానుల రిక్వెస్ట్
By: Sankar Sat, 26 Sept 2020 2:20 PM
ఐపీయల్ టైటిల్ ఫేవరేట్ లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండు మ్యాచ్ లలో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే..ఇప్పటివరకు ఈ సీజన్లో మూడు మ్యాచ్లు ఆడితే.. ముంబైతో మ్యాచ్ మినహా రాజస్తాన్, డిల్లీతో జరిగిన మ్యాచ్ల్లో పూర్తిగా విఫలమైంది.
బౌలింగ్లో ఎంతో కొంత నయంగా కనిపిస్తున్న చెన్నై బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. మిడిలార్డర్లో డుప్లెసిస్ తప్ప ఓపెనర్లు వాట్సన్, మురళీ విజయ్, రుతురాజ్, కేదార్ జాదవ్లు తమ ఆటతీరుతో తీవ్ర నిరాశ పరుస్తున్నారు. ఇక ధోని బ్యాటింగ్ అంశంపై ఇప్పటికీ చర్చ నడుస్తూనే ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్ రావడమేంటని విమర్శలు వస్తున్నాయి.
ముంబైతో మ్యాచ్లో అంబటి రాయుడు, డుప్లెసిస్ ప్రదర్శనతో గట్టెక్కిన చెన్నై రెండో మ్యాచ్కు వచ్చేసరికి రాయుడు గాయంతో దూరమవ్వడంతో నాసిరక ప్రదర్శన చేసింది. డుప్లెసిస్ ఒక్కడే పోరాడుతున్నా.. అతనికి సహకరించేవారు కరువయ్యారు. దీంతో సురేశ్ రైనా అంశం మరోసారి తెరమీదకు వచ్చింది.
రైనా జట్టులో ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని.. టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉండేదని.. చెన్నైకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదని అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైనా తిరిగి ఐపీఎల్కు రావాలంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు. ' రైనా.. నీ అవసరం జట్టుకు ఎంతో ఉంది. మిడిలార్డర్లో నీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ప్లీజ్.. రైనా తిరిగిరావా' అంటూ సోషల్ మీడియా వేదికగా సీఎస్కే అభిమానులు వేల సంఖ్యలో మెసేజ్లు చేస్తున్నారు