జాన్వీ కపూర్ కెరీర్ గురించి అభిమానుల్లో కంగారు
By: chandrasekar Mon, 29 June 2020 6:34 PM
బాలీవుడ్లో చాలామంది
భవిష్యత్తు ప్రస్తుతం కరణ్ చేతిలో ఉంది. ఎంత పెద్ద సెలెబ్రిటీ అయినా తమ పిల్లలను
హీరోలుగానో, హీరోయిన్స్ గానో పరిచయం చేయాలంటే వెంటనే వాళ్లు
కలిసేది కరణ్ జోహార్ ని. స్టార్ కిడ్స్ సినిమాల్ని నిర్మించడం మొదలు, ఆ
తర్వాత వాళ్లకి కొత్త ప్రాజెక్టులు సెట్ చేయడం, ప్రమోషన్ వగైరాలన్నింటిపై కరణ్ స్పెషల్ కేర్
తీసుకుంటాడనేది బాలీవుడ్లో బహిరంగ రహస్యం.
అలా చాలామంది భవిష్యత్తు
ప్రస్తుతం కరణ్ చేతిలో ఉంది. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సుసైడ్తో నెపోటిజంపై
విమర్శలు వెల్లువెత్తడం, అందులోనూ ముఖ్యంగా కరణ్ పై ట్రోలింగ్, కొన్నిచోట్ల
కేసులు కూడా నమోదు అవుతుండడంతో కరణ్ గుప్పిట్లో ఉన్న సెలెబ్రిటీ వారసుల
భవిష్యత్తుపై అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా
పుంజుకుంటున్న శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కెరీర్ గురించి అభిమానుల్లో కంగారు
మొదలైంది.
గతంలో తన కూతురిని
హీరోయిన్గా నిలబెట్టే బాధ్యత కరణ్ జోహార్ కి అప్పగించింది శ్రీదేవి. కరణ్ కూడా
శ్రీదేవికిచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాడు.
ఎటొచ్చీ ఇటీవల సుశాంత్ సూసైడ్ ఇష్యూతో ప్రమోషన్ యాక్టివిటీస్ కి కొంత బ్రేక్
ఇచ్చాడు. ఆ ప్రభావం ఆగస్టు 15న ఓటీటీ ద్వారా (నెట్ ఫ్లిక్స్) విడుదల కానున్న
జాన్వీ మూవీ ‘గుంజన్ సక్సేనా’పై పడింది. మరో రెండు భారీ ప్రాజెక్టులకి కూడా
జాన్వీతో కరణ్ సైన్ చేయించగా అవి కూడా ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే సూచనలు
కనిపిస్తున్నాయి.
దీనికి తోడు నెపోటిజంపై
పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో ఆ ప్రభావం కూడా జాన్వీ కెరీర్ పై పడే అవకాశాలు
లేకపోలేదు. అయితే ఇక్కడ జాన్వీ తండ్రి బోనీకపూర్ ప్రముఖ నిర్మాత అనే విషయం కూడా
గుర్తుంచుకోవాలి. హిందీలోనే కాక ఇటు తెలుగులో పవన్ తో, అటు
తమిళంలో అజిత్ తో సినిమాలు తీస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ ఆయన. అంతగా జాన్వీకి
అవకాశాలు తగ్గితే తన కూతురితోనే వరుస సినిమాలు తీసే సత్తా ఉన్నవాడు.