Advertisement

  • అప్పటికే పెళ్లి అయిన ఫేస్‌బుక్‌ ప్రియుడి చేతిలో మోసపోయిన యువతీ

అప్పటికే పెళ్లి అయిన ఫేస్‌బుక్‌ ప్రియుడి చేతిలో మోసపోయిన యువతీ

By: Sankar Tue, 04 Aug 2020 10:37 PM

అప్పటికే పెళ్లి అయిన ఫేస్‌బుక్‌ ప్రియుడి చేతిలో మోసపోయిన యువతీ



ఫేస్‌బుక్‌ పరిచయం ప్రేమగా మారింది.. ఆపై ఇద్దరు సహజీవనం చేశారు.. తీరా యువతి పెళ్లి చేసుకోమనగానే సదరు యువకుడు తనకు ఇంతకు మునేపే పెళ్లి జరిగిందని యువతితో చెప్పడంతో ఖంగుతిన్న సదరు యువతి ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించింది. ఆర్‌జీఐఏ సీఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివారలు ఇలా ఉన్నాయి.. నగరంలోని కుషాయిగూడ చక్రిపురం కాలనీకి చెందిన యువతి మండలంలోని బహదూర్‌గూడకు చెందిన రాజ్‌కుమార్‌ కి ఏడాదిన్నర కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.

పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో ఎనిమిది నెలల కిందట పట్టణంలోని ఆర్‌బీనగర్‌లో భార్యభర్తలుగా చెప్పుకుంటూ ఓ అద్దెగదిలో నివాసముంటూ సహజీవనం చేశారు. ఇటీవల ఇద్దరి మధ్యన మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. యువతి తనను వివాహం చేసుకోవాల్సిందిగా రాజ్‌కుమార్‌ను కోరింది ..

అయితే తనకు అప్పటికే పెళ్లి జరిగిందని తేల్చిచెప్పడంతో పాటు సదరు యువతిని పెళ్లి చేసుకోనని చెప్పడంతో మోసపోయినట్లుగా గుర్తించిన యువతి ఆదివారం ఆర్‌జీఐఏ పోలీసులను ఆశ్రయించింది. తనను నమ్మించి మోసం చేశాడని వాపోయింది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Tags :
|
|

Advertisement