మరో సరికొత్త ఫీచర్తో ముందుకొచ్చిన ఫేస్బుక్
By: chandrasekar Tue, 15 Sept 2020 6:20 PM
సోషల్ మీడియా దిగ్గజం
ఫేస్బుక్ మరో సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. మెసేంజర్ యాప్ ద్వారా
స్నేహితులందరూ కలిసి వీడియోలను చూసే అవకాశం కల్పించింది. ఇందుకోసం ‘వాచ్ టుగెదర్’
అనే ఫీచర్ను తీసుకొచ్చింది.
వీడియో కాల్ ద్వారా 8 మంది
స్నేహితులను యాడ్ చేసుకునే అవకాశాన్ని ఈ ఫీచర్ కల్పిస్తుంది. వీడియో
కాన్ఫరెన్సింగ్ టూల్ మెసెంజర్ రూమ్స్ ద్వారా 50 మందిని యాడ్ చేసుకోవచ్చు. జూమ్ వీడియో
కమ్యూనికేషన్స్ను ఎదుర్కొనే ఉద్దేశంతో ఈ ఏడాది జులైలోనే ఈ టూల్ను ఫేస్బుక్
అందుబాటులోకి తెచ్చింది.
కరోనా మహమ్మారి కారణంగా
ఇంటికే పరిమితమైన లక్షలాది మందిని చేరుకునే ఉద్దేశంతో ఈ ఫీచర్ను తీసుకొచ్చింది
ఫేస్బుక్. కాగా, నెట్ఫ్లిక్స్లోనూ ఫేస్బుక్ ‘వాచ్ టుగెదర్’ లాంటి
ఫీచరే ఉంది. ‘నెట్ఫ్లిక్స్ పార్టీ’ పేరుతో దీనిని స్టార్ట్ చేసింది. ఒకే స్క్రీన్పై
ఒకే సినిమాను పలువురు చూసేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.