- హోమ్›
- వార్తలు›
- మైక్రోవేవ్లో బౌల్ వేడెక్కకుండా పదార్థం మాత్రమే వేడి చేసే బౌల్ ను అభివృద్ధి చేసిన నిపుణులు
మైక్రోవేవ్లో బౌల్ వేడెక్కకుండా పదార్థం మాత్రమే వేడి చేసే బౌల్ ను అభివృద్ధి చేసిన నిపుణులు
By: chandrasekar Fri, 07 Aug 2020 09:19 AM
మైక్రోవేవ్లలో వేడి చేసే
ప్రక్రియ స్టవ్ల కంటే భిన్నంగా ఉంటుందని కూడా వెల్లడించింది. మైక్రోవేవ్ల
పనితీరు గురించి ఒక అధ్యయనం వెలుగులోకి వచ్చింది. నీటిని స్టవ్టాప్పై
ఉంచినప్పుడు, ఉష్ణ
ప్రసరణ కారణంగా అది వేడి అవుతుంది. అంటే దీని అర్థం దిగువ నుంచి వేడి నీరుపైకి
కదులుతుంది. దీని ఫలితంగా నీరు సమానంగా వేడి అవుతుంది.
కానీ, మైక్రోవేవ్ల విషయంలో ఇలా జరుగదు. మైక్రోవేవ్లో
నీటిని ఉంచినప్పుడు, అది
ఉంచిన కంటైనర్ దానంతట అదే వేడి అవుతుంది. ఈ ప్రక్రియలో నీరు కేవలం అడుగు భాగం
నుంచి మాత్రమే కాకుండా అన్ని వైపుల నుంచి వేడి అవుతుంది. దీని వల్ల ద్రవ ప్రసరణ
జరగదు. అలాగే అది సమానంగా వేడెక్కదు.
గ్లాస్ భాగంలో నీరు
అడుగున ఉన్న దాని కంటే చాలా వేడిగా ఉంటుంది. మైక్రోవేవ్లో ఉంచినప్పుడు ద్రవాన్ని
మరింత సమానంగా వేడి చేసే గ్లాస్ (గాజు) ను నిపుణులు అభివృద్ధి చేశారు. అలా౦టి
వస్తువును తయారు చేయడానికి పరిశోధకులు గాజు అంచు మీద సన్నని సిల్వర్ కోటింగ్ వేశారు.
దీంతో ద్రవం ఎక్కువగా వేడెక్కకుండా నిరోధించబడుతుంది. ఇది కన్వెక్షన్ ద్వారా
నీటిని వేడెక్కేందుకు దోహదపడుతుంది.
‘తగిన పరిమాణంలో లోహ
నిర్మాణాన్ని జాగ్రత్తగా రూపొందించిన తరువాత, మండే
అవకాశం ఉన్న లోహపు అంచు, బలహీన
క్షేత్ర స్థాయిలో ఉంటుంది. అక్కడ ఇది పూర్తిగా వేడిని పరిహరించగలదు. అందువల్ల ఇది
ఇప్పటికీ సురక్షితంగా ఉంటుందని’ అధ్యయనం సహ రచయిత బావోక్వింగ్ జెంగ్ తెలిపారు.