చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రధాన రోడ్ల విస్తరణ చేపట్టాలి
By: chandrasekar Thu, 17 Sept 2020 12:16 PM
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె
యాదయ్య చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రధాన
రోడ్ల విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ను కోరారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల
సందర్భంగా సీఎం కేసీఆర్ను కలిశారు. నియో జకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, శంక ర్పల్లి, మొయినాబాద్, నవాబుపేట్
మండలాలకు సంబంధించిన ప్రధాన రోడ్ల విస్తరణ గురించి వివరించారు. వెలిమెల నుంచి
పొద్దుటూర్ వరకు రేడియల్ రోడ్డు నిర్మించాలని అసెంబ్లీలో మాట్లాడారు.
పటాన్చెరువు రింగ్రోడ్డు
నుంచి వెలిమెల మీదుగా కొండకల్, మోకిలా, టంగటూర్ వరకు రేడియల్ రోడ్డు పనులు ప్రారంభించి
ఏడాది గడిచినా పూర్తికాలేదన్నారు. మొయినాబాద్ మండలం హిమాయత్నగర్ నుంచి చేవెళ్ల
మండలం కౌకుంట్ల వరకు తంగెడపల్లి, కొత్తపల్లి, ప్రగతి, మేడిపల్లి గ్రామాల మధ్యలో అసంపూర్తిగా వంతెనల వద్ద
రోడ్డు పనులు పెండింగ్ ఉండడంతో చాలా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని
పేర్కొన్నారు. దీనికి స్పందించిన మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి రోడ్డు పనులు
పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు.