Advertisement

  • కాంగ్రెస్ సీనియర్ నేత కారు బోల్తా ..స్వల్ప గాయాలు

కాంగ్రెస్ సీనియర్ నేత కారు బోల్తా ..స్వల్ప గాయాలు

By: Sankar Wed, 01 July 2020 09:58 AM

కాంగ్రెస్ సీనియర్ నేత కారు బోల్తా ..స్వల్ప గాయాలు



కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. రాంరెడ్డి ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురై బోల్తా పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సుజాత నగర్‌ మండలం డేగల మడుగు వద్ద ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వస్తున్న మరో కారు దామోదర్‌రెడ్డిని బలంగా ఢీకొట్టింది. దీంతో మాజీ మంత్రి కారు బోల్తా కొట్టడంతో.. స్వల్ప గాయాలతో దామోదర్‌రెడ్డి బయటపడ్డారు.

ఇది గమనించిన స్థానికులు దామన్నకు స్థానిక వైద్యులతో ప్రథమ చికిత్స అందించి అనంతరం మరో వాహనంలో లింగాలకు తరలించారు. మాజీ మంత్రికి పెను ప్రమాదం తప్పడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు..

ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకులలో దామోదరెడ్డి ఒకరు ..సూర్యాపేటలో మంచి పట్టు ఉన్న నేత ..2009 ఎలెక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ తరుపున సూర్యాపేట నుంచి శాసన సభ ఎన్నికల్లో గెలుపొందారు ..దివంగత వై యస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలాజీ మినిస్టర్ గా పనిచేసారు

Tags :
|

Advertisement