Advertisement

కరోనా తో మాజీ మంత్రి కన్నుమూత

By: Sankar Tue, 01 Sept 2020 10:00 PM

కరోనా తో మాజీ మంత్రి కన్నుమూత


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పని చేసిన ప్రముఖ రాజకీయ నాయకుడు మాతంగి నర్సయ్య(76) కన్నుమూశారు. ఇటీవల ఈయన కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఆ వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో అక్కడ ఆయన చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. కరోనాతో పాటు మాతంగి నర్సయ్యకు ఇతర ఆనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. దీనికి తోడు కరోనా సోకడంతో ఆరోగ్య పరిస్థితి మరింతగా విషమించింది.

కాగా మాజీ మంత్రి, మాతంగి నర్సయ్య మృతి పట్ల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మేడరాం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి నర్సయ్య చేసిన కృషిని గుర్తు చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

అతని భార్య జోజమ్మ వారం రోజుల క్రితమే చనిపోయారు. వారం వ్యవధిలోనే ఇంట్లో ఇద్దరూ చనిపోవడంతో కుటుంబంలో తీవ్రమైన విషాదం నెలకొంది. గతంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఈయన టీడీపీ తరపున గెలుపొందారు. టీడీపీ ప్రభుత్వంలో కొంతకాలం పాటు మంత్రిగా పని చేశారు.

Tags :
|

Advertisement