ప్లాన్ ప్రకారమే అంతా చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
By: chandrasekar Tue, 01 Dec 2020 8:23 PM
తెలంగాణ బీజేపీ
అద్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ముగిసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ భయాందోళనకు
గురైన ఓటర్లు బెదరలేదన్నారు. పోలింగులో పాల్గొన్న ఓటర్లందరికి కృతజ్ఙతలు తెలిపారు.
ఈసీ నిర్లక్ష్యం వల్ల
పోలింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఓటింగ్ శాతం తగ్గించడానికి కుట్ర
జరిగిందన్నారు. సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని తేలడంతోనే టీఆర్ఎస్ పార్టీ కుట్రలు
చేసిందని ఆయన ఆరోపించారు. కేసీఆర్కు టీచర్లపై నమ్మకం లేదన్నారు. అందుకే అనుభవం
లేని వ్యక్తులకు, అనుకూలం లేని వ్యక్తులతో ఎన్నికల విధుల కోసం
నియమించారన్నారు.
టీఆర్ఎస్, ఎంఐఎం
అక్రమాలు అరాచకాలు సృష్టం అయ్యాయన్నారు. డబ్బులు మద్యం పంపిణీ చేశారని ఆరోపించారు.
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకున్నామన్నారు. ఈసీ, రాష్ట్ర
ప్రభుత్వం కలిసి ఓటింగ్ శాతం తగ్గించాయని ఆరోపించారు.
ఇంత ఘోర పరిస్థితి
ప్రజస్వామ్య దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. ఎన్నికల కమిషన్ నామ్ కే వాస్తే అన్నారు.
మొదటి నుంచి ప్లాన్తో అంతా
నడిపించారన్నారు. ప్లాన్ ప్రకారమే ఫోర్ డేస్ సెలవులు కూడా ఇచ్చారన్నారు. దుబ్బాక
ఎన్నికతో కేసీఆర్, ఓవైసీ, ఈసీ, డీజీపీ కలిసి ప్లాన్ ప్రకారం అంతా చేశారన్నారు.