Advertisement

  • కరోనాను దైర్యంగా ఎదుర్కొందాం ..ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

కరోనాను దైర్యంగా ఎదుర్కొందాం ..ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్

By: Sankar Tue, 28 July 2020 6:23 PM

కరోనాను దైర్యంగా ఎదుర్కొందాం ..ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్



కరోనా వైరస్ మహమ్మారి మానవాళి మొత్తానికి పెను సవాలుగా తయారైందని మంత్రి ఈటల రాజేందర్ పునరుద్ఘాటించారు. దీని నివారణ పెను సవాల్‌గా మారిందని, కంటిమీద కునుకులేకుండా చేస్తోందని అన్నారు. కరోనా బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచి వారికి మరింత సేవలందించాలని ఆరోగ్య అధికారులకు మంత్రి సూచించారు.

వరంగల్‌లో కరోనా కేసులు గత రెండు మూడు రోజుల నుంచి తీవ్రంగా నమోదవుతున్న నేపథ్యంలో మరో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి ఈటల రాజేందర్ సి.ఎస్.ఆర్ గార్డెన్స్‌లో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ను సకాలంలో గుర్తించని వారికి ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో 81 శాతం మంది బాధితులు కరోనా లక్షణాలు లేకుండానే కోలుకోవడమే ఇందుకు నిదర్శనమని ఈటల అన్నారు.

కరోనా వైరస్‌ను ధైర్యంగా ఎదుర్కొందామని ఈటల పిలుపునిచ్చారు. పూర్వం అనేక రకాల ప్రమాదకర వ్యాధులను ఎదుర్కొని వాటి నుంచి సురక్షితంగా బయటపడ్డ సత్తా మన సొంతమని గుర్తు చేశారు. అయితే, వ్యాధి లక్షణాలతో బాధపడుతున్న వారు మాత్రం తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సిందేనని మంత్రి సూచించారు.

అనంతరం పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులను ప్రతిఒక్కరూ ఓ సవాలుగా స్వీకరించి పనిచేయాలన్నారు. ప్రభుత్వం వద్ద నిధులకు కొరత లేదని ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాల పెంపునకు అధికంగా ఖర్చు చేయాలని గతంలోనే సీఎం నిర్దేశించినట్లు ఎర్రబెల్లి చెప్పారు..ఇక ఈ సమీక్ష సమావేశంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు బండ ప్రకాశ్‌, కవిత, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పెద్ది సుదర్శన్‌ రెడ్డి, నన్నపనేని నరేందర్‌, సీతక్క తదితరులు పాల్గొన్నారు

Tags :
|
|

Advertisement