Advertisement

కరోనాతో మరణించిన ఆ దేశప్రధాని

By: Sankar Mon, 14 Dec 2020 12:33 PM

కరోనాతో మరణించిన ఆ దేశప్రధాని


ఆఫ్రికా ఖండంలోని ఎస్వతిని దేశ ప్రధానమంత్రి అంబ్రోస్ మండ్వూలో డ్లమిని (52) కోవిడ్-19కు చికిత్స పొందుతూ కన్నుమూశారు. అతి చిన్న దేశమైన ఎస్వతినిలో సంపూర్ణ రాచరిక ప్రభుత్వం అధికారంలో ఉంది.

నాలుగు వారాల కిందట కరోనా వైరస్ బారినపడ్డ ప్రధాని అంబ్రోస్ డ్లమిని చికిత్స కోసం దక్షిణాఫ్రికాలోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారని ఎస్వతిని ఉప ప్రధాని తెంబా మసుకు తెలిపారు. కరోనాకు మెరుగైన చికిత్స కోసం అంబ్రోస్ ను దక్షిణాఫ్రికాకు తరలించినా, ఫలితం లేకపోయిందని తెంబా ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా కరోనా కారణంగా ప్రపంచ దేశాలు అన్ని అతలాకుతలం అయితున్నాయి ..అయితే ఆఫ్రికా దేశాలలో యూరోప్ దేశాలతో పోలిస్తే కరోనా తీవ్రత కొంచెం తక్కువగానే ఉంది..అయితే ఎస్వతినిలో ఇప్పటి వరకు 6,768 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇప్పటి వరకు 127 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.


Tags :

Advertisement