మొట్ట మొదటి మెడికల్ డివైసెస్ పార్క్ ను కేరళలో ఏర్పాటు
By: chandrasekar Wed, 23 Sept 2020 1:31 PM
మొట్ట మొదటి మెడికల్
డివైసెస్ పార్క్ ను కేరళలో ఏర్పాటు చేయనున్నారు. హై రిస్క్ మెడికల్ పరికరాల
తయారీపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తూ, ఆ రంగంలో పూర్తి స్థాయి సేవలందించే బయో మెడికల్
పార్క్ గా తాయారు కాబోతుంది. వైద్య పరికరాల తయారీ రంగంలో పరీక్ష విధానం, పరిశోధన
- రూపకల్పన, వైద్య
పరికరాల పనితీరుపై అంచనా వంటి అంశాల్లో పూర్తి స్థాయి సేవలను ఈ మెడికల్ పార్క్
అందిస్తుంది. మెడ్.స్పార్క్ పేరిట ఈ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర శాస్త్ర
సాంకేతిక విభాగం పరిధిలో స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేసే చిత్ర తిరుణాల్
వైద్యవిజ్ఞాన, సాంకేతిక పరిజ్ఞాన సంస్థ కేరళ రాష్ట్ర పారిశ్రామిక
అభివృద్ధి సంస్థ , కేరళ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఉమ్మడి చొరవతో ఈ
బయోమెడికల్ పార్క్ ఏర్పాటు కానున్నది.
తిరువనంతపురం, తొణ్ణక్కల్
ప్రాంతంలో ఉన్న జీవ శాస్త్రాల పార్క్ లో ఈ పార్క్ ను నిర్మించనున్నారు. కీలకమైన
శస్త్ర చికిత్సలో వినియోగించే ముఖ్యమైన వైద్య పరికరాల తయారీపై ఈ సంస్థ ప్రత్యేక
దృష్టి పెట్టనుంది . శరీరం అంతర్భాగంగా అమర్చే హై రిస్క్ యాంత్రిక ఇంప్లాంట్ల
తయారీకి ఈ సంస్థ ప్రాధాన్యం ఇస్తుంది. పార్క్ నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న
ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి. సంస్థకు హైరిస్క్ ఇంప్లాంట్ల తయారీ రంగంలో మంచి పరిజ్ఞానం
ఉన్నది. కీలకమైన వైద్య పరికరాలకు సంబంధించి వాటి పనితీరుపై పూర్తి స్థాయి సేవలందించే వ్యవస్థను ఈ సంస్థ
కల్పిస్తుంది. తయారీ మద్దతు, సాంకేతిక పరిజ్ఞాన సృజనాత్మకత, పరిజ్ఞాన
వ్యాప్తి తదితర అంశాలకు సంబంధించి వైద్య పరికరాల తయారీ రంగానికి అవసరమైన
సేవలన్నింటినీ ఈ సంస్థ అందిస్తుంది. మెడ్.స్పార్క్ పరిధిలోని వైద్య పరికరాల
పరిశ్రమలతో పాటుగా, దేశంలోని ఇతర ప్రాంతాల్లోని ఈ తరహా పరిశ్రమలు కూడా ఈ
సేవలను వినియోగించుకోవచ్చు. దీనితో వైద్య పరికరాల తయారీ రంగంలో ఉన్న చిన్న, మధ్యతరహా
మెడికల్ డివైజెస్ తయారీ పరిశ్రమలకు ఈ పార్క్ ప్రయోజనకరంగా ఉండబోతుంది.