Advertisement

  • కరోనాతో కాంట్రాక్టర్ మృతి ..ఎర్రగడ్డ రైతు బజార్ మూసివేత

కరోనాతో కాంట్రాక్టర్ మృతి ..ఎర్రగడ్డ రైతు బజార్ మూసివేత

By: Sankar Mon, 06 July 2020 6:50 PM

కరోనాతో కాంట్రాక్టర్ మృతి ..ఎర్రగడ్డ రైతు బజార్ మూసివేత


హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న వేళ.. ఎర్రగడ్డ రైతు బజార్ మూతపడింది. రైతు బజార్‌లోని ఓ కాంట్రాక్టర్ కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో రైతుబజార్‌ను మూడు రోజులపాటు మూసివేశారు. రైతుబజార్ ప్రాంగణాన్ని శానిటైజ్ చేసిన అధికారులు.. కాంట్రాక్టర్‌తో కాంటాక్ట్ అయిన వారిని హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలను కనిపిస్తే తమకు సమాచారం అందించాలన్నారు.

ఈ విషయం తెలియడంతో ఎర్రగడ్డ రైతు బజార్‌కు వెళ్లిన వారు భయాందోళనలకు లోనవుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో నగరంలోని పలు మార్కెట్లను మూసివేశారు. కొద్ది రోజులపాటు మూతపడిన లాడ్ బజార్, బేగం బజార్ లాంటి ప్రధాన మార్కెట్లు మళ్లీ తెరుచుకుంటున్నాయి. సాయంత్రం 4 గంటల వరకే వ్యాపారులు దుకాణాలను తెరిచి ఉంచుతున్నారు.

ఇక తెలంగాణాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గత 24 గంటల్లో 5290 శాంపిళ్లను పరీక్షించగా.. 1590 పాజిటివ్ అని తేలాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 23,902 కరోనా కేసులు నమోదు కాగా.. 295 మంది ప్రాణాలు కోల్పోయారు.

Tags :
|
|

Advertisement