Advertisement

  • మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫెసిలిటీ ని ప్రవేశపెట్టిన 'ఈపీఎఫ్'

మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫెసిలిటీ ని ప్రవేశపెట్టిన 'ఈపీఎఫ్'

By: chandrasekar Wed, 17 June 2020 7:56 PM

మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫెసిలిటీ ని ప్రవేశపెట్టిన 'ఈపీఎఫ్'


ఉద్యోగులు కరోనా కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఆర్ధిక సమస్యలు తీర్చుకోవడానికి తమ ఈపీఎఫ్ ఖాతా లోని డబ్బులు తీసుకోవడానికి ప్రభుత్వం అనేక వసతులను కలిగిస్తూ వుంది. దేశంలో కరోనా మహమ్మరి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ఈపీఎఫ్ కార్యాలయాలు త‌క్కువ సిబ్బందితోనే ప‌నిచేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో విధుల్లో ఉన్న కొద్దిమంది సిబ్బందికి ప‌ని భారం పెరిగి ఖాతాదారుల క్లెయిమ్ సెటిల్‌మెంట్ల‌లో తీవ్ర జాప్యం జ‌రుగుతున్న‌ది. దీంతో ఏ ప్రాంతీయ కార్యాలయంలోనైనా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లు పూర్తి చేసుకునేలా పాత‌ విధానంలో మార్పులు చేశారు.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌) ఖాతాదారులకు వెసులుబాటు క‌ల్పించేలా ఈపీఎఫ్‌వో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లలో సమస్యలు తలెత్తకుండా ఓ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఏ ప్రాంతీయ కార్యాల‌యంలోనైనా క్లెయిమ్ సెటిల్‌మెంట్ల‌ను పూర్తిచేసుకునేలా 'మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫెసిలిటీ'ని ప్రారంభించింది.

పీఎఫ్, పింఛన్‌, నగదు పాక్షిక ఉపసంహరణ, బదిలీ క్లెయిమ్‌ల వంటి అన్ని రకాల ఆన్‌లైన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ల‌ను ఈ 'మల్టీ లొకేషన్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ఫెసిలిటీ' ద్వారా పూర్తి చేసుకోవచ్చని ఈపీఎఫ్‌ఓ వెల్లడించింది. దీనిద్వారా ఉద్యోగులు త్వరగా డబ్బులు పొందడానికి వీలవుతుందని తెలియజేసింది.

Tags :
|
|

Advertisement